Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎదురుకాల్పుల్లో పది మంది మృతి

Maoists
భద్రాచలం: ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పది మరణించారు. మృతుల్లో ఐదుగురు మావోయిస్టులు, ఐదుగురు పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఎదురుకాల్పులపై పోలీసులు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగిన కిష్టాపురం అటవీ ప్రాంతంలోని పాలచల్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుల్లో ఉంటుంది.

కిష్టాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద యెత్తున సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నక్సలైట్లు ఎదురు పడ్డారు. ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ అయుధ కర్మాగారాన్ని కూడా కనుక్కున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+