జగన్ పై నీచమైన కుట్ర: ఆనం

YS Ra
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ పై నీచమైన కుట్రకు పాల్పడుతున్నారని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కె.కేశవరావు, హనుమంతరావు, రేణుకా చౌదరిలపై విరుచుకు పడ్డారు. సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పనికి రారని ఆయన పరోక్షంగా అన్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిల తర్వాత తమకు చేరువ గల నాయకుడు జగన్ మాత్రమేనని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఆనం వివేకానంద రెడ్డి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు కావడం గమనార్హం. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం సంభవించినవి సహజ మరణాలేనని వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యను వివేకానంద రెడ్డి ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+