నేనేమీ మాట్లాడను: రోశయ్య

రాష్ట్రంలోని ఐదు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నికైన వారిని ఆయన అభినందించారు. ఈ విజయంతో భవిష్యత్తులో ప్రజల కోసం మరింత అంకితమై ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి దూరమైన తర్వాత వచ్చిన ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోగలమా లేదా అనే సందేహం కలిగిందని, వైయస్ దూరమైన తర్వాత కూడా కాంగ్రెసు పై అభిమానంతో ప్రజలు తమ పార్టీని గెలిపించారని ఆయన అన్నారు. సోనియా గాంధీ సమర్థ నాయకత్వం తమకు విజయాలను అందిస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో 41 స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేకపోయినా ఆయన స్ఫూర్తి సజీవంగానే ఉందని రోశయ్య వ్యాఖ్యానించారు. సోనియా నాయకత్వంలో మన్మోహన్ సింగ్ సమర్థ పాలన అందిస్తున్నారని, అది కాంగ్రెసుకు బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications