వైయస్ జగన్ మాతోనే ఉంటారు: డి శ్రీనివాస్

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ పై పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని, మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పార్టీ అధిష్టానం నాయకులు తీరిక లేకుండా ఉన్నారని, అధిష్ఠానంతో సహకరించాలని ఆయన అన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరూ చెబుతూనే ఉన్నారని, అయితే టీవీ చానెళ్లు ముందుకు రాగానే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారని ఆయన అన్నారు. జగన్ కూడా పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. మనం చేసే పని వల్ల పార్టీ ప్రతిష్ట పెరగాలని ఆయన అన్నారు. ప్రజలు మన ప్రవర్తనను ప్రశంసించాలని, పార్టీ గౌరవం పెరగాలని ఆయన అన్నారు. ఎవరు కూడా సొంత బలం మీద విజయం సాధించలేదని, పార్టీ టికెట్ మీదనే గెలిచారని, పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఎంతో కసరత్తు జరిగిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. అందరం కలిసి ముందుకు సాగితేనే పార్టీ బలపడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో చక్కని నాయకత్వం ఉందని, ఆ నాయకత్వాన్ని బలపరిచేలా వ్యవహరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications