ప్రజలను జలసర్పం కాటేసింది

కర్నూలు, మంత్రాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందల మంది గల్లంతయ్యారు. కర్నూలు జిల్లాలోనే 700 మంది జాడ కనిపించడం లేదు. వరద నీటిలో చిక్కుకుని వేలాది మంది సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. తుంగభద్ర నది వరదకు కర్నూలు జిల్లా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో చిమ్మ చీకట్లో గ్రామాలు రాత్రంతా గడపాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో గోడ కూలి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో పది మంది గల్లంతయ్యారు. పంట నష్టం అపారంగా సంభవించింది. రాయలసీమకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. కర్నూలు జిల్లా సంద్రాన్ని తలపిస్తోంది. కర్నూలు జిల్లాలోని 12 మండలాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి. పోతిరెడ్డిపాడు పాడు వద్ద అతిథిగృహంలోకి నీరు చేరాయి. ముఖ్యమంత్రి కె. రోశయ్య రాత్రంతా సచివాలయంలోనే ఉండి వరద పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications