మానవ వైఫల్యం లేకుండా..: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవడంలో మానవ వైఫల్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. తాము రాత్రంతా సచివాలయంలోనే ఉండి వరద తాకిడి ప్రాంతాల్లోని అధికారులకు మనో ధైర్యం కలిగించడానికి ప్రయత్నించామని ఆయన చెప్పారు. అఖిల పక్ష నేతలతో సమావేశం అనంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులందరూ వచ్చి తగిన సూచనలు చేశారని ఆయన చెప్పారు. ప్రజలకు, అధికారులకు మనో నిబ్బరం కలిగించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. సిఆర్ఎం నుంచి నిధులు తీసుకోవడానికి కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లాలని తాను అనుకున్నానని, అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. ఎక్కువ కాల్స్ రావడం వల్ల హెల్ప్ లైన్లు సరిగా పనిచేయలేదని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లోని ప్రజలకు మంచినీరు అందించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నియోజక వర్గాల వారీగా వరద పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం నుంచి 25 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుతోందని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.

వరద తాకిడి ప్రాంతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు నాలుగు వేల రూపాయలేసి, పాక్షికంగా ధ్వంసమైన ఇళ్లకు మూడు వేల రూపాయలేసి నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+