విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులది కొంగ జపం: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
విజయవాడ: వరద తాకిడి ప్రాంతాల్లో బాధితులను ఆదుకునే విషయంలో రాష్ట్ర మంత్రులు కొంగ జపం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. వరద తాకిడికి గురైన భవానీపురం, కృష్ణలంక, కరకట్ట ప్రాంతాల్లో ఆయన గురువారం నాడు పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ముంపు బాధితుల ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంతాల నుంచి బాధితులు తరలే విషయం కమ్యూనిస్టు పార్టీలను మంత్రులు తప్పు పట్టడం సరి కాదని, కరకట్ట వాసులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తే వారు వరద ముంపు ప్రాంతాల నుంచి తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని ఆయన అన్నారు.

వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేస్తే బాగుండేదని ఆయన అన్నారు. ప్రజలు వరదలతో సతమవుతూ ఉంటే మంత్రులు సాయం చేయడానికి నామమాత్రంగా వచ్చారని, వారు ప్రజలు ఆదుకోవడానికి చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, కొంగ జపం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులది ఆత్మ స్తుతి పరనింద లాగా ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X