Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాతీయ విపత్తు కోసం కోరుతాం: రోశయ్య

Rosaiah
విజయవాడ: రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కోరుతామని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయడానికి వస్తున్న ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం చెప్పడానికి ఆయన శుక్రవారం ఇక్కడికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరదల పరిస్థితిని ప్రధాని సాయంత్రం రాజభవన్ లో సమీక్షిస్తారని ఆయన చెప్పారు. కేంద్ర సాయం మరవలేనిదని ఆయన అన్నారు. కేంద్రాన్ని మరింత సాయం కోరుతామని ఆయన చెప్పారు.

వరదల నష్టాన్ని తాము ఇంకా పూర్తిగా అంచనా వేయలేదని ఆయన చెప్పారు. పూర్తి వివరాలు వచ్చాక నివేదిక రూపొందించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. కేంద్రం భారీగా సాయం అందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడికి బయలు దేరే ముందు ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గవర్నర్ ఎన్డీ తివారీని రాజభవన్ కలుసుకున్నారు. ప్రధాని పర్యటనపై ఆయన గవర్నర్ కు వివరించినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+