మంత్రులతో జోరుగా జగన్ మంతనాలు

కాగా, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు గురువారంనాడు వైయస్ జగన్ ను పరామర్శించారు. జగన్ విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. జగన్ కు తగిన స్థానం పార్టీ అధిష్టానం కల్పిస్తుందని ఆయన చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల కోసం యానాం నియోజకవర్గంలో వసూలు చేసిన 23 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications