హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సత్తా రోశయ్యకు లేదు: ఆదినారాయణ రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎదుర్కునే సత్తా వైయస్ జగన్ కే మాత్రమే ఉందని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య వేగంగా పని చేయలేరని, సచివాలయంలో కూర్చుని పని చేస్తే సరిపోరని, ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజల్లోకి వెళ్లే సత్తా జగన్ కు మాత్రమే ఉందని ఆయన అన్నారు. జగన్ ఈ నెల 22వ తేదీ లోగా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వస్తుందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి అంటే కేవలం సచివాలయంలోనే ఉండటం కాదని, ప్రజల్లోకి చొచ్చుకుని పోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంపై అధిష్టానం జాప్యం చేస్తుండడంపై చాలా మంది శాసనసభ్యులు బాధగా ఉన్నారని, తమ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పక గౌరవిస్తారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X