విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విటిపిఎస్ లో అగ్నిప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: విజయవాడ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రం (విటిపిఎస్)లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. కేంద్రంలోని ఏడో నెంబర్ యూనిట్ కు చెందిన జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేడంతో అధికారులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దాంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాదాపు 15 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అనధికార అంచనా. పక్షం రోజుల్లో కొత్త జనరేటర్ అమరుస్తామని జెన్కో ప్రకటించింది.

విటిపిఎస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి బిహెచ్ఇఎల్ దే బాధ్యత అని చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు ఆరోపించారు. బిహెచ్ఇఎల్ సరఫరా చేసిన పరికరాల నాణ్యతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పరికరాల నాణ్యతపై జెన్ కో డైరెక్టర్ రాధాకృష్ణ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని సరఫరా చేసిన బిహెచ్ఇఎల్ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X