కర్నాటకలో యెడ్యూరప్పకు ఎదురు'గాలి'

ఉత్తర కర్నాటకలో వరద సహాయక చర్యల బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి జామ్ దార్ కు, నిర్వాసితులకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం ఆసరా బాధ్యతలను తన సన్నిహిత మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కు యెడ్యూరప్ప అప్పగించారు. నిజానికి వరద సహాయక చర్యలు రెవెన్యూ శాఖ అధ్వర్యంలో జరగాలి. రెవెన్యూ శాఖ మంత్రి అయిన గాలి కరుణాకర్ రెడ్డికి తెలియకుండానే ముఖ్యమంత్రి ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో గాలి సోదరులు తీవ్ర ఆగ్రహానికి గురై అసమ్మతి బావుటా ఎగురేశారు. అంతేకాకుండా ఇనుప ఖనిజ రవాణాపై అభివృద్ధి సుంకం విధించాలని ఈ నెల 13వ తేదీన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం కూడా గాలి సోదరులకు మింగుడు పడలేదు.
గాలి సోదరుల తిరుగుబాటు నేపథ్యంలో యెడ్యూరప్ప మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 34 మంత్రుల్లో 22 మంది హాజరయ్యారు. ముఖ్యమంత్రి రాజీకి ప్రయత్నిస్తున్నా అసమ్మతి నేతలు ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రిగా శాసనసభ సభాపతి జగదీశ్ శెట్టర్ కు అసమ్మతి నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. శెట్టర్ తో కరుణాకర్ రెడ్డి తదితరులు చర్చలు జరిపారు. వచ్చే నెల 2వ తేదీన హోస్పేటలో నిర్వహించే సభ ద్వారా బలప్రదర్సన చేయాలని అసమ్మతి నేతలు సంకల్పించుకున్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications