కర్నాటకలో యెడ్యూరప్పకు ఎదురు'గాలి'

ఉత్తర కర్నాటకలో వరద సహాయక చర్యల బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి జామ్ దార్ కు, నిర్వాసితులకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం ఆసరా బాధ్యతలను తన సన్నిహిత మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కు యెడ్యూరప్ప అప్పగించారు. నిజానికి వరద సహాయక చర్యలు రెవెన్యూ శాఖ అధ్వర్యంలో జరగాలి. రెవెన్యూ శాఖ మంత్రి అయిన గాలి కరుణాకర్ రెడ్డికి తెలియకుండానే ముఖ్యమంత్రి ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో గాలి సోదరులు తీవ్ర ఆగ్రహానికి గురై అసమ్మతి బావుటా ఎగురేశారు. అంతేకాకుండా ఇనుప ఖనిజ రవాణాపై అభివృద్ధి సుంకం విధించాలని ఈ నెల 13వ తేదీన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం కూడా గాలి సోదరులకు మింగుడు పడలేదు.
గాలి సోదరుల తిరుగుబాటు నేపథ్యంలో యెడ్యూరప్ప మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 34 మంత్రుల్లో 22 మంది హాజరయ్యారు. ముఖ్యమంత్రి రాజీకి ప్రయత్నిస్తున్నా అసమ్మతి నేతలు ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రిగా శాసనసభ సభాపతి జగదీశ్ శెట్టర్ కు అసమ్మతి నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. శెట్టర్ తో కరుణాకర్ రెడ్డి తదితరులు చర్చలు జరిపారు. వచ్చే నెల 2వ తేదీన హోస్పేటలో నిర్వహించే సభ ద్వారా బలప్రదర్సన చేయాలని అసమ్మతి నేతలు సంకల్పించుకున్నారు.
-
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications