విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెజిహెచ్ జూ. డాక్టర్ల సమ్మె ఉధృతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నంలో కెజిహెచ్ జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతమైంది. వారి సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. వారికి సీనియర్ డాక్టర్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. సమ్మె పరిష్కారానికి ఆస్పత్రి సూపరింటిండెంట్, జిల్లా కలెక్టర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగి బంధువులు దాడి చేయడంతో మూడు రోజుల క్రితం జూనియర్ డాక్టర్లు సమ్మె ప్రారంభించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు ప్రాణ భయంతో ప్రైవేట్ అస్పత్రులకు తరలిపోతున్నారు. దీంతో కెజిహెచ్ ఆస్పత్రి సగం ఖాళీ అయింది.

ఆస్పత్రిలో ప్రైవేట్ సిబ్బందిని నియమించి తమకు రక్షణ కల్పించే వరకు సమ్మెను విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియా అస్పత్రుల్లో మాదిరిగా తమకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రాతిపదికపై 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తామని కలెక్టర్ చెప్పారు. అయితే అందుకు జూనియర్ డాక్టర్లు అంగీకరించడం లేదు. సమ్మె చేసినప్పుడు హామీలు ఇచ్చి ఆ తర్వాత మరిచిపోతున్నారని జూనియర్ డాక్టర్లు విమర్శిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X