వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గాలి' ఓబుళాపురంపై చర్యకు బాబు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

నారా చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని, యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కె. రోశయ్యను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యకు లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ముఖ్యమంత్రికి అందజేశారు. ఓబుళాపురం మైనింగ్ యాజమాన్యం రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలకు గండి పెడుతోందని నర్సింహులు మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. అక్రమాలు జరుగుతున్న రాష్ట్ర మైనింగ్ శాఖ నిద్రపోతోందని ఆయన విమర్శించారు. వందల ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన ఆరోపించారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులను ఖాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ కంపెనీ పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ మాఫియా గ్యాంగ్ పనిచేస్తోందని, ఎవరిని కూడా ఆ ఛాయలకు రానీయడం లేదని, డిఎఫ్ఓపై దాడి చేశారని ఆయన చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై చర్చకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X