వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Australia
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై తాజాగా దాడి జరిగింది. ఆస్ట్రేలియన్ల గుంపు ఒకటి 22 ఏళ్ల సాయి రతన్ తివారీ అనే విద్యార్థిపై ముఖంపై పిడి గుద్దులు గుద్దింది. ఇక్కడ నీకు చోటు లేదంటూ ఆస్ట్రేలియన్లు తనపై దాడి చేశారని ఆ విద్యార్థి చెప్పాడు. ఆదివారంనాడు తన మిత్రుడితో కలిసి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కు చెందిన సాయి రతన్ తివారీ దేవాలయానికి వెళ్తుండగా ఇద్దరు ఆస్ట్రేలియన్లు వారిని ఆపి దాడి చేసినట్లు అతను చెప్పాడు.

ఇన్ ఫర్మేషన్ సిస్టమ్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదవడానికి ఏడాది క్రితం సాయి రతన్ తివారీ ఆస్ట్రేలియాకు వచ్చాడు. బల్లారత్ విశ్వవిద్యాలయంలో చదివిన తివారీ తాను దేవాలయానికి వెళ్తున్నట్లు చెప్పడానికి కూడా భయపడ్డానని చెప్పాడు. తన మిత్రుడు పోలీసులకు ఫోన్ చేస్తుండగా వారు అతని మొబైల్ ఫోన్ ను లాక్కున్నట్లు తివారీ చెప్పాడు. తను స్పృహ తప్పి పడిపోయినట్లు అతను తెలిపాడు. అతనికి అంబులెన్స్ వైద్యులు చికిత్స చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X