ఓబుళాపురంపై రాష్ట్రపతికి రాస్తా: గవర్నర్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లీజులు రద్దు చేయాలని, ఓబుళాపురం వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లన్నీ శాససనభా స్పీకర్ వద్ద ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ సూచనలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై గవర్నర్ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని నమ్ముతున్నట్లు లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, దేశ ప్రజాస్వామ్య సమస్య అని ఆయన అన్నారు. ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు ముఖ్యమంత్రి రోశయ్య నాభి నుంచి వచ్చింది కాదని, నోటి నుంచి వచ్చింది మాత్రమేనని సిపిఐ నాయకుడు కె. నారాయణ వ్యాఖ్యానించారు. ఓబుళాపురం గను లీజును రద్దు చేయకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం సరి కాదని సిపిఎం నాయకుడు మధు అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ Governor jayaprakash narayana chandrababu naidu nd tiwari గవర్నర్ జయప్రకాష్ నారాయణ ఎన్డీ తివారీ obulapuram mines ఓబుళాపురం చంద్రబాబు నాయుడు
Story first published: Wednesday, November 18, 2009, 16:54 [IST]