హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కేం సంబంధం లేదు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు ఏ విధమైన సంబంధం లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. వివిధ టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఆ విధంగా ఉన్నారు. ఓబుళాపురం మైనింగ్ వివాదం రెండు కంపెనీలకు చెందిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గతంలో అంగీకరించిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం కాబట్టే సిబిఐ దర్యాప్తునకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సిబిఐ విచారణ జరిపించాలని తాను సొంతంగానే నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో ఎవరి ఒత్తిడీ లేదని ఆయన చెప్పారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ పాల్గొనే విషయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని, తనకు ఏ విధమైన ఇబ్బందీ లేదని ఆయన చెప్పారు. మంత్రులు ఎంత మంది ఉన్నారనేది ముఖ్యం కాదని, ఎంత బాగా పనిచేస్తున్నారనేది ముఖ్యమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులందరూ తన పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X