రోశయ్య, చంద్రబాబు సవాళ్ల పోరు

రోశయ్య ప్రతిస్పందించిన తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తాము ఒక్కటి కోరితే రోశయ్య మరోదానికి ప్రతిస్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు, అక్రమాలకు ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై తాము మాట్లాడుతుంటే రోశయ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆయన ఆదివారం అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గనులను మూసేయాలని సుప్రీంకోర్టు సాధికార కమిటీ సూచించలేదా అని ఆయన అడిగారు. తాము ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై మాట్లాడుతుంటే రోశయ్య ఎదురుదాడికి దిగురుతున్నారని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications