రెండో కోణమేదీ: కెసిఆర్ దీక్షపై మందకృష్ణ

బలవంతంగా సెలైన్ ఎక్కించిన తర్వాత దీక్ష భగ్నమైనట్లేనని, ఆ తర్వాత కూడా పండ్ల రసం తీసుకోకపోతే కెసిఆర్ నైతికత మీద ప్రశ్నతలెత్తుతుందని, పండ్ల రసం తీసుకోకపోవడంలో అర్థం లేదని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రతిఘటించిన విషయం నిజమా, కాదా ప్రభుత్వం బయట పెట్టాలని ఆయన అన్నారు. కెసిఆర్ పండ్ల రసం తీసుకుంటున్న దృశ్యం చూసిన తర్వాత షరతులేవీ లేకుండా దీక్ష విరమించారనే అనుమానాలు తలెత్తుతున్నాయని, కేసిఆర్ ప్రతిఘటించిన దృశ్యాలు లేకపోవడం వల్ల ఈ అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం ఎప్పుడూ కాదని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమైతే తనకు వర్గీకరణ ముఖ్యమైందని ఆయన చెప్పారు. కెసిఆర్ లోని దొరల లక్షణాన్నే తాను గతంలో తప్పు పట్టానని, తెలంగాణకు వ్యతిరేకంగా తాము ఎప్పుడూ లేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications