హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో పోలీసులు: ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఓయులోని విద్యార్థుల రిలే నిరాహార దీక్షల టెంట్లను పీకేశారు. ఆర్ట్స్ కళాశాల లోపలికి ప్రవేశించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీన విద్యార్థులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. తక్షణమే ఉస్మానియా నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని జెఎసి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు బలగాలకు వ్యతిరేకంగా ఆర్ట్ర్ కళాశాల వెలుపల విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల లోగా పోలీసు బలగాలను ఉపసంహరించాలని జెఎసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వ తీరుపై ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. విద్యార్థులపై అణచి వేత చర్యలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X