హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభే ఉండదు, తీర్మానమెక్కడిది: జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శాసనసభనే రద్దవుతుందని, ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ఎక్కడ ఉంటుందని తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ కాంగ్రెసు నాయకుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన రాజీనామా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేందుకు కాదని, నిస్సహాయ స్థితిలోనే తాను రాజీనామా చేశానని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణేతర కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు విమర్సిస్తున్నారు. తమ అభిప్రాయాలు తీలుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని వారంటున్నారు. సమైక్య రాష్ట్రాన్ని తాము కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

తమ ప్రాంతాల ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము రాజీనామాలు చేస్తున్నామని వారన్నారు. రాష్ట్రాన్ని చీల్చడానికి కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీ కుట్ర చేశారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా వారు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎవరిచ్చారని తెలుగుదేశం శాసనసభ్యుడు ఉమా మహేశ్వర రావు అడిగారు. తమ రాజీనామాల వెనక కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుల ప్రమేయం లేదని కాంగ్రెసు శాసనసభ్యులు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి వ్యతిరేకించారు. రాష్ట్రాని విభజించాల్సి వస్తే మూడు ముక్కలు చేయాలని ఆమె అన్నారు. 13 మంది ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కూడా రాజీనామా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X