సభే ఉండదు, తీర్మానమెక్కడిది: జెసి
తమ ప్రాంతాల ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము రాజీనామాలు చేస్తున్నామని వారన్నారు. రాష్ట్రాన్ని చీల్చడానికి కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీ కుట్ర చేశారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా వారు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎవరిచ్చారని తెలుగుదేశం శాసనసభ్యుడు ఉమా మహేశ్వర రావు అడిగారు. తమ రాజీనామాల వెనక కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుల ప్రమేయం లేదని కాంగ్రెసు శాసనసభ్యులు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి వ్యతిరేకించారు. రాష్ట్రాని విభజించాల్సి వస్తే మూడు ముక్కలు చేయాలని ఆమె అన్నారు. 13 మంది ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కూడా రాజీనామా చేశారు.