తెలంగాణ కోసం ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియపై ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి కె. రోశయ్య సమైక్యాంధ్ర గురించి మాట్లాడడం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ లో అన్నారు. తెలంగాణ తీర్మానంపై రోశయ్య రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో వెంటనే తీర్మానం ప్రతిపాదించాలని, లేకుంటే తాము భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ వాదం ప్రతి చోటా బలపడిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications