వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లగడపాటి మాయం: పోలీసులపై సబిత ఆగ్రహం
రాజగోపాల్ కోసం అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. రాజమండ్రిలో కూడా ఆయన కోసం గాలిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి మంగళగిరిలోని ఎన్నారై అస్పత్రికి తరలించడానికి గంట ముందు ఆయన విజయవాడ ఆస్పత్రి నుంచి మాయమయ్యారు. అంతకు ముందే తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావును ఎన్నారై ఆస్పత్రిలోని అత్యవసర సేవా విభాగానికి తరలించారు. లగడపాటి అదృశ్యం నేపథ్యంలో విజయవాడలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయనపై 309 కేసు నమోదు చేశారు.
Story first published: Monday, December 21, 2009, 9:10 [IST]