తెలంగాణ ప్రక్రియకు తోడ్పడాలి: డిఎస్

పార్టీని బలహీనపరిచే చర్యలను కార్యకర్తలు ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు తాము సమర్థుడైన వైయస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయామని ఆయన అన్నారు. పార్టీకి ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పార్టీ నాయకులు వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డికి కూడా డిఎస్ నివాళులు అర్పించారు. ఆయన రెండో వర్ధంతి సందర్భంగా ఆయన ఈ నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications