వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేకాంధ్రతోనే అభివృద్ధి: హరిబాబు

By Santaram
|
Google Oneindia TeluguNews

BJP
రాజమండ్రి: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె హరిబాబు పేర్కొన్నారు. బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి విక్రమ్‌ హాలులో బుధవారం జరిగిన జై ఆంధ్ర జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి అంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యిందని ఈ సందర్భంగా హరిబాబు చెప్పారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేమని, ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడితేనే ఆయన ఆత్మకు శాంతి అన్నారు.

మనరాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రం అభివృద్ధికి వారు సాధించిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఎంతమంది ఎంపీలు అన్నది కాదు, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిదనేదే ముఖ్యమన్నారు. హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారన్నారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్‌, హరిరామజోగయ్య వంటి నాయకులు ప్రత్యేక ఆంధ్ర కావాలని చెబుతున్నారన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఏ మాటచెప్పినా దృఢంగా ఉండేదని, ఇప్పటి ప్రధాని మనోహ్మన్‌సింగ్‌, సోనియాగాంధీల మాటలకు పొంతన ఉండడం లేదన్నారు. తెలంగాణపై ఇప్పటికే రెండుసార్లు మాటలు మార్చారని, మూడోమాటకూడా చెబుతారని అన్నారు. బీజేపీ 1997 నుంచి ప్రత్యేక రాష్ట్ర అభిప్రాయాన్ని చెబుతోందన్నారు. చిన్నరాష్ట్రాల విభజనల వల్లే అభివృద్ధి సా«ధ్యమవుతుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X