మీ జగన్ సమైక్యమంటున్నారు: రావుల

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ మహబూబ్ నగర్ జిల్లాకు ఇంచార్జీ మంత్రిగా ఉన్నారని, అయినా తమ జిల్లాకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. తమ తెలుగుదేశం పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడానికి, ఆడిపోసుకోవడానికి మాత్రమే కోమటిరెడ్డి పరిమితమవుతున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణ మంత్రులు ఒరగబెట్టేందేమీ లేదని, వారికి కాంగ్రెసు అధిష్టానం నేతల అపాయింట్ మెంటు కూడా దొరకలేదని, వారికి దొరికిందల్లా కె. కేశవరావు అపాయింట్ మెంటు మాత్రమేనని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డిపై కోమటి రెడ్డి పనికి మాలిన మాటలు మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సాధనకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనని, పార్టీలను ఇబ్బంది పెట్టింది కూడా కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications