వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5వ తేదీ ఢిల్లీ యాత్రపై బాబు డైలమా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై ఈ నెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర రాజకీయ పార్టీల సమావేశానికి వెళ్లాలా, వద్డా అనే డైలమాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పడ్డారు. పార్టీ ప్రాంతాలవారీగా రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆయన తీవ్ర ఇరకాటంలో పడ్డారు. కోస్తాంధ్ర నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా, తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారు. ఈ స్థితిలో ఈ నెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో ఒక అభిప్రాయాన్ని పార్టీ పరంగా చెప్పలేని ఇరకాటంలో చంద్రబాబు పడ్డారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు దాన్ని ధిక్కరించి సమైక్య నినాదంతో ఉద్యమిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు పడ్డారు. పార్టీ వైఖరి మారిపోయిందని ఎర్రంనాయుడి వంటి పార్టీ నేతలు చంద్రబాబు ప్రమేయం లేకుండానే ప్రకటిస్తున్నారు.

కాగా, తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అనివార్యతలో ఈ ప్రాంత తెలుగుదేశం నాయకులు పడ్డారు. విద్యార్థులు, ప్రజల ఒత్తిడి తట్టుకోలేని స్థితిలో వీరు తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన ఆగత్యంలో పడ్డారు. దీనిపై జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరించడంలో చంద్రబాబు మునిగిపోయారు. అన్ని జిల్లాల అభిప్రాయాలను తీసుకుని ఐదో తేదీ సమావేశానికి వెళ్లాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. సమావేశానికి వెళ్లాలనే నాయకులు కూడా ఎక్కువ మందే ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X