తిరుపతి: తిరుపతి బైపాస్ రోడ్డులోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. లారీ- క్వాలీస్ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలున్నారు.
వీరంతా లక్నోలోని గోమతి నగర్కి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మీరా, సేవాపాండే, రితి, సునీల్, అరవింద్, రాజేష్ మృతి చెందారు. గాయపడిన ప్రియా, కుష్బూ, బ్యూటీ, సన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.