వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ ప్రమాదం ఉందన్నారు: రాయపాటి సాంబశివరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తనతో అన్నట్లు కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. చిదంబరంతో సీమాంధ్ర నేతల భేటీ అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడితేనే తెలంగాణ దిశగా ప్రక్రియ ఉంటుందని చిదంబరం తనతో అన్నట్లు ఆయన చెప్పారు.

రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనకపోతే రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందని కూడా చిదంబరం అన్నట్లు ఆయన తెలిపారు. శాంతియుతంగా ఉండాలని తాము సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశామని ఆయన అన్నారు. తమలాగే తెలంగాణ నేతలు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకుంటే కాంగ్రెసు ఎప్పుడైనా ఇస్తుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X