సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: యాదవ్

SSP Yadav
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తాను ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు ఉద్దేశ్యవూర్వకంగానే తనను లక్ష్యం చేసుకున్నాయని ఆయన అన్నారు. మీడియా తనపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆగ్రాకు వెళ్తూ ఢిల్లీలో ఆగిన ఆయన గురువారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్టీసి చార్జీల పెంపుపై తనకు చెప్పలేదని రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చేసిన వ్యాఖ్యపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తనపై వస్తున్న విమర్శలు తనకు తెలియవని ఆయన అన్నారు. మీడియా నిరాధారంగా రాస్తే తాను సమాధానం చెప్పలేనని ఆయన అన్నారు. తాను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని, ఎండిగా తాను ఎక్కడికైనా వెళ్లవచ్చునని ఆయన అన్నారు. తాను అధికారిక పనుల మీదనే ఆగ్రా వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ విషయాల గురించి తాను మాట్లాడబోనని, ఆర్టీసి గురించైతే తాను మాట్లాడగలనని ఆయన అన్నారు.

ఆర్టీసి గురించి గానీ తన గురించి గానీ ఏదైనా రాసే ముందు తనను సంప్రదించాలని ఆయన మీడియాను కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే చార్జీల పెంపు విషయంలో తాను వ్యవహరించానని, బోర్డు నియమనిబంధనల మేరకే చార్జీలు పెంచామని ఆయన అన్నారు. పేదవారిపై భారం పడకుండా చార్జీలు పెంచినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసి తీవ్రమైన నష్టాల్లో ఉందని, నష్టాల నుంచి బయటపడడానికి చార్జీలు పెంచక తప్పలేదని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆర్టీసి చార్జీలు ఢిల్లీలో చార్జీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, ఇక్కడ చార్జీలు ఎలా ఉన్నాయో చూడండని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వం ఆర్టీసికి ఏ విధమైన సహాయం చేయడం లేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+