వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కేంద్ర ప్రకటన కోసం చూస్తున్నాం: హరీష్

By Santaram
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంటనే ప్రారంభించాలని తెరాస నేత హరీష్‌రావు ఆదివారం డిమాండ్‌ చేశారు. తమకు తెలంగాణ సాధనే ముఖ్యమని పదవులు కాదని ఆయన స్పష్టం చేశారు. చర్చల పేరుతోనో మరో పేరుతోనో తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తే వూరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై కేంద్రప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని ఆయన వెల్లడించారు.

తెలంగాణ వచ్చేదాక చట్ట సభలకు వెళ్లమని ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే టి.హరీష్‌రావులు చెప్పా రు. నిన్న మెదక్‌జిల్లా జోగిపేటలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి పులుగు కిష్టయ్య, నారాయణగౌడ్‌ల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి వారి ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారు.

అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ చివరిదశకు చేరుకున్నదని, ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల్లోంచి విద్యార్థుల్లోకి చేరిందని, దానిని ఆపటం ఎవరితరం కాదని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం ద్వారానే తాము చట్టసభలకు ఎన్నికయ్యామని, తెలంగాణ లేని పదవులు తమకెందుకని రాజినామాలు చేశామని పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X