శబరమలై యాత్రలో 12 మంది ఆంధ్రుల మృతి

Sabarimala Yatra
విజయవాడ: శబరమలై యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 12 మంది స్వాములు అసువులు బాశారు. వతనన్ తిట్టా జిల్లాలోని కరిమెల సమీపంలో వారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందినవారు. వారంతా యువకులే. ఈ ప్రమాదంలో మరో 27 మంది గాయపడ్డారు. రెండు లారీల్లో 73 మంది స్వాములు, భక్తులు శబరిమలై బయలుదేరారు. శబరికి సమీవంలోని ఎలిమేడు నుంచి కాలినడకన వెళ్లాల్సిన వారు భారీ వర్షం కారణంగా లారీల్లోనే పంబకు బయలుదేరారు. ఈ సమయంలో ప్రమాదం సంభవించింది.

మంగళవారం రాత్రి శబరిమలైకి సమీపంలో భారీ వర్షం కురిసింది. పంబకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు కర్నాటకకు చెందినవారు కూడా మరణించారు. భారీ వర్షంలో వేలాది మంది భక్తులు చిక్కుకున్నారు. స్వాములు ఏర్పాటు చేసిన తాత్కాలిక విడుదులు కూడా జలమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+