నీరు తగ్గడంతో పాపికొండల బోట్లపై నిషేధం

దాంతో శనివారం పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి నుంచి పర్యాటక బోట్లను అధికారులు అనుమతించారు. అయితే శనివారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి సమీపంలో రాజమండ్రి యూనియన్కు చెందిన లాంచీలు చిక్కుకుపోయి పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పదిరోజులపాటు నిషేధం విధిస్తున్నట్టు విశ్వనాథరాజు అన్నారు. పర్యాటకుల యోగక్షేమాల దృష్ట్యా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు విశ్వనాథరాజు పేర్కొన్నారు. పర్యాటక బోట్లు, లాంచీలు పర్యాటకులను తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తిరిగి ఎప్పుడు అనుమతి ఇచ్చేదీ రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖల అధికారులు లాంచీల, బోట్ల యజమానులతో సమావేశమై చర్చించి ప్రకటన విడుదల చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications