గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

రోడ్డుకు అడ్డంగా వచ్చిన పిల్లిని తప్పించేందుకు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో సోమవారం రాత్రి స్థానిక నులకపేట సమీపంలో ఆటో పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. నలుగురికి గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు.. ఏలూరు పవర్పేటకు చెందిన లక్ష్మి, మరో ఆరుగురు బంధువులతో కలిసి చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మేనత్తను పరామర్శించేందుకు వచ్చింది.
తిరుగు ప్రయాణంలో ఆట ఎక్కారు. నులకపేట సమీపంలోకి వచ్చాక పిల్లిని చూసి డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆటో అదుపు తప్పి పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. వెలపోలు సత్తెమ్మ, వెంకటలక్ష్మి, సత్యవతి, అనసూయలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పిల్లి కూడా మరణించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వచ్చిన 108 సిబ్బంది బాధితల్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications