తెలంగాణపై కేంద్రాన్ని దింపుతాం: దామోదర్ రెడ్డి

వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడియస్ యు నేత అశోక్ అన్నారు. దీనికి కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేణుగోపాల్ రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.












Click it and Unblock the Notifications