జిల్లాల్లో టిడిపి 'సమైక్యాంధ్ర' సదస్సులు

Telugudesam
హైదరాబాద్‌: ప్రాంతాలవారీగా సమైక్యాంధ్ర సదస్సులు నిర్వహిస్తూ సమైక్యాంధ్ర ఆవశ్యకతను తెలియజేస్తామని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ సదస్సుల్లో విద్యార్థి సంఘాల జెఎసి కూడా పాల్గొనాలని వారు కోరారు. ఈనెల 22, 23తేదీలలో గవర్నర్‌ని కలసి సమైక్యాంధ్రవాదాన్ని వినిపిస్తామని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం జెఎసి పెట్టిన గడువు సమీపిస్తున్న కొద్దీ కోస్తా ఆంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం వేడెక్కుతోంది.

సమైక్యాంధ్ర ఉద్యమానికి మళ్లీ నేతలు సమాయత్తమవుతున్నారు. గత నెల 23న తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా కేంద్రం మరో ప్రకటన చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ కోస్తా, సీమల్లోని 13 జిల్లాల్లోనూ అన్ని వర్గాల ప్రజలను ఉద్యమానికి సిద్ధం చేయాలని నిశ్చయించారు. ఈ మేరకు జేఏసీ నేతలు, ప్రొఫెసర్లు ఎన్‌.శామ్యూల్‌, నరసింహారావు, గౌరీశంకర్‌, విద్యార్థి జేఏసీ నేతలు వెంకట రమణ, ఆశీరత్నం తదితరులు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిన్న విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడారు.

ప్రజలను ఉద్యమానికి సిద్ధం చేసేందుకు అన్ని జిల్లాల్లోనూ సదస్సులు నిర్వహించాలని, తొలి సదస్సును ఈనెల 20న విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం 24న నెల్లూరు, 25న తిరుపతిల్లో సదస్సులు నిర్వహించాలని, మిగతా జిల్లాల్లో సదస్సుల షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేస్తామని ప్రకటించారు. మరోపక్క, గుంటూరు జిల్లా జేఏసీ నేతలు కూడా సోమవారం సమావేశమయ్యారు. పరీక్షలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో విద్యార్థి గర్జన నిర్వహించడం భావ్యం కాదని, కేంద్రం ప్రకటన ఆధారంగా విద్యార్థి గర్జనపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+