వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వచ్చి తీరుతుంది: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఆయన మంగళవారం కన్నీటి పర్యంతమయ్యారు. తాము విద్యార్థులకు అండగా ఉండి ఉద్యమాన్ని నడిపిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. విద్యార్థులెవరూ తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యార్థి ఆత్మహత్య విషయం తెలిసి తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యతో విద్యార్థిలోకం దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాదులోనూ, తెలంగాణలోనూ విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ లో మానవ హారం ఏర్పాటు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, కాంగ్రెసు నాయకుడు ఆర్. దామోదర్ రెడ్డి, తెరాస నాయకుడు హరీష్ రావు సందర్శించారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు ఉస్మానియాకు వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X