తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్య

వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే వేలాదిగా విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. లా కళాశాల విద్యార్థులు ఆత్మహత్యకు నిరసనగా బైక్ ర్యాలీ తీశారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల మనస్తాపాన్ని చూసైనా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు రామారావు గౌడ్, అజయ్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు పోరాడి తెలంగాణను సాధించుకుందామని, ఆత్మహత్యలకు మాత్రం పాల్పడవద్దని వారు విద్యార్థులను కోరారు.












Click it and Unblock the Notifications