వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో తమిళుల ఆత్మహత్యా యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తమిళనాడుకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు తిరుమలలో ఆత్యహత్యా యత్నానికి పాల్పడ్డారు. తిరుమలలోని సప్తగిరి 376 కాటేజీలో ఈ సంఘటన జరిగింది. చెన్నైలోని తిరువన్నమలైకు చెందిన నాగమణి తన ముగ్గురుబిడ్డలతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. నాగమణితో పాటు ఓ బిడ్డ మరణించగా, ఇద్దరు బిడ్డల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

నాగమణి భర్త జాడ మాత్రం తెలియడం లేదు. అతను కనిపించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్మహత్యా యత్నానికి సంబంధించిన సమాచారం అందగానే తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంధి హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు మరణించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఆత్మహత్యకు యత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X