వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం ఇంటి ముందు మందకృష్ణ ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేస్తూ మాదిగ దండోరా నాయకుడు మందకృష్ణ మాదిగ, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఫిబ్రవరి 2వ తేదీన ముఖ్యమంత్రి కె. రోశయ్య ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ జెఎసి వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం తెలంగాణపై కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనపై పూర్తిగా విశ్వాసం కలగడం లేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీంతో ఆందోళనలను కొనసాగించాలని జెఎసి వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.

ఫిబ్రవరి 3వ తేదీన జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టిడిస్తారు. ఆ తర్వాత ఏడో తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాలని నిర్ణయించారు. ఏడో తేదీన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి పొలికేక సభ ఉంది. ఆ సభకు పెద్ద యెత్తున తరలిపోవాలని నిర్ణయించారు. 7వ తేదీలోగా తెలంగాణ కోసం నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన రాకపోతే ప్రజాప్రతినిధుల రాజీనామాల కోసం ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. కాగా, డెడ్ లైన్లను, ప్రజాప్రతినిధుల రాజీనామాలను కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఏడో తేదీ తర్వాత తీవ్రమైన ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రాజీనామాలపై ఒత్తిడికి గడువులు తెలంగాణ రాజకీయ జెఎసి ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X