వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం ఇంటి ముందు మందకృష్ణ ధర్నా
ఫిబ్రవరి 3వ తేదీన జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టిడిస్తారు. ఆ తర్వాత ఏడో తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాలని నిర్ణయించారు. ఏడో తేదీన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి పొలికేక సభ ఉంది. ఆ సభకు పెద్ద యెత్తున తరలిపోవాలని నిర్ణయించారు. 7వ తేదీలోగా తెలంగాణ కోసం నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన రాకపోతే ప్రజాప్రతినిధుల రాజీనామాల కోసం ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. కాగా, డెడ్ లైన్లను, ప్రజాప్రతినిధుల రాజీనామాలను కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఏడో తేదీ తర్వాత తీవ్రమైన ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రాజీనామాలపై ఒత్తిడికి గడువులు తెలంగాణ రాజకీయ జెఎసి ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించింది.
Story first published: Friday, January 29, 2010, 16:45 [IST]