వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంపై సీమాంధ్ర ఎమ్మెల్యేల చిందులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
హైదరాబాద్: తెలంగాణపై కమిటీ వేయాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు శనివారం కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై కమిటీ వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన విషయంలో చిదంబరం వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. కమిటీ ఏకపక్ష నిర్ణయాలను తాము అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను సమర్థిస్తే అది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, భవిష్యత్తులో అది దేశ విభజనకు దారి తీస్తుందని వారన్నారు. వేర్పాటు వాదం కోసం కమిటీ వేస్తున్నారా, సమైక్యవాదం కోసం వేస్తున్నారా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణపై కమిటీ వేయాలనే నిర్ణయంపై తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు శనివారం ఇక్కడ సమావేశమై చర్చించారు.

తెలుగు జాతిని విభజించే హక్కు కాంగ్రెసు కోర్ కమిటీకి ఎవరిచ్చారని తెలుగుదేశం శాసనసభ్యుడు దూళిపాళ నరేంద్ర చౌదరి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 21 కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉండగా ఒక్క తెలంగాణ కోసమే ఎందుకు కమిటీ వేస్తున్నారని ఆయన అడిగారు.ఆంధ్రప్రదేశ్ విభజన అనేది చిదంబరం వ్యక్తిగత ఎజెండా అని దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసుకు రాష్ట్రాల విభజనపై ఒక విధానం ఉండాలి గానీ ప్రాంతీయ పార్టీలాగా ఆంధ్రప్రదేశ్ పట్ల మాత్రమే ప్రత్యేకంగా వ్యవహరించడం సరి కాదని నరేంద్ర చౌదరి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X