వైష్ణవి హత్య: సబితపై చిరంజీవి ధ్వజం

Chiranjeevi
హైదరాబాద్: విజయవాడలో నాగవైష్ణవి అనే పాప హత్య సంఘటనపై రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీవ్రంగా ధ్వజమెత్తారు. సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రిగా ఉన్న కాలంలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించలేకపోయారని ఆయన అన్నారు. సబితా ఇంద్రారెడ్డి పనితీరు బాగా లేకపోవడం వల్లనే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆయన విమర్సించారు. సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

వైష్ణవి కిడ్నాప్ జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడం వల్లనే ఇంత దారుణం జరిగిందని ఆయన అన్నారు. కిడ్నాప్ జరిగిన వెంటనే విజయవాడను పోలీసులు అష్టదిగ్బంధం చేసి ఉంటే హత్య జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హత్య కేసులో నిందితుడు వెంకటరావు తమ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన మాట నిజమేనని, తాము టికెట్ ఇవ్వలేదని, అతను ప్రస్తుతం చురుగ్గా పార్టీలో పనిచేయడం లేదని ఆయన వివరించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా నాయకులకు సూచించినట్లు ఆయన తెలిపారు. నాగవైష్ణవి తండ్రి ప్రభాకర్ మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+