వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ జెఎసి ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: తెలంగాణపై స్పష్టమైన ప్రకటనను కోరుతూ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీ నుంచి ఇద్దరు శాసనసభ్యులు హాజరయ్యారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

అసంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులను మీడియాను అనుమతించలేదు. శాసనసభ ఆవరణ సమీపంలోని గన్ పార్కు వద్దనే మీడియాను నిలిపేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరుతూ జెఎసి వారం రోజల ఆందోళనకార్యక్రమం ప్రకటించింది. ఇందులో భాగంగా మంగళవారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభ్యులు ధర్నాకు దిగారు. సోమవారం కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెసు నాయకులు పాల్గొనలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X