వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం రోశయ్య విశాఖ జిల్లా పర్యటన రద్దు

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: ముఖ్యమంత్రి రోశయ్య విశాఖ జిల్లా పర్యటన రద్దు అయింది. వివిధ అధికారిక పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లి అక్కడ మూడు రోజులపాటు వుండాల్సి రావడంతో రోశయ్య జిల్లాకు రావడం లేదని అధికారులు తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల ఐదవ తేదీన ఫార్మా సిటీలో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాలి.

అయితే నాలుగో తేదీన ఢిల్లీ పర్యటనకు బయలుదేరాల్సి రావడం, అక్కడ మూడు రోజులు వుండాల్సి రావడంతో ఆయన జిల్లాకు వచ్చే అవకా శాలు దాదాపు లేనట్టేనని తెలిపారు. ఢిల్లీలో తొలిరోజున శాంతిభద్రతలు, రెండవ రోజున ధరలపై నిర్వహించే సమావేశాలకు ఆయన హాజర వుతారు. చివరిరోజున యూపీఏ చైర్మన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లతో భేటీ కానున్నారు. అయితే ఈ నెలాఖరులోగా సీఎం పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X