చంద్రబాబు నన్ను అవమానించారు: జయప్రద

చంద్రబాబు తనను అవమానించినప్పుడు ఏడ్చి ఏడ్చి అందరికీ చెప్పుకున్నానని, అనుభవరాహిత్యం వల్ల అలా చేశానని, ఇప్పుడు తాను అలా లేనని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కుంటానని ఆమె అన్నారు. తనను ఆదరిస్తామంటే, గెలిపిస్తామంటే ఆంధ్రప్రదేశ్ కు వస్తానని, తాను ఆంధ్రప్రదేశ్ ఆడపడుచునని ఆమె అన్నారు. ఏ పార్టీలో ఇప్పుడే చేరబోనని, తనకు ఇంకా నాలుగున్నరేళ్ల వ్యవధి ఉందని, పార్లమెంటు సభ్యురాలిగా తన గడువు ముగిసిన తర్వాతనే ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటున్నానని ఆమె అన్నారు. తనపై కూడా రాజకీయ దాడులు జరిగాయని ఆమె చెప్పారు. వాటిని తాను ఎదుర్కుంటానని ఆమె చెప్పారు.
తెలంగాణ, సమైక్యాంధ్రల్లో ప్రజలకు ఏం కావాలో అది చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. అర్థరాత్రి నిర్ణయం సరి కాదని ఆమె అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తాను తన అభిప్రాయం చెబుతానని ఆమె అన్నారు. తెలంగాణలో ఎదుటి తెలుగువాడినే అసహ్యించుకునే పరిస్థితి ఉందని, దానికి కారణాలేమిటో కనుక్కుని కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందా అనే విషయాన్ని ఆలోచించాలని, అన్నదమ్ముల్లా ప్రేమించుకునే అవకాశం ఉందా అని ఆలోచించాలని, అందుకు తగిన వాతావరణ కల్పించగలిగితే మంచిదని ఆమె పదే పదే ప్రశ్నించగా అన్నారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. కమిటీ వేయకూడదని తాను అనలేదని, అలాంటి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందని మాత్రమే అంటున్నానని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను ఉత్తరప్రదేశ్ పరిస్థితులతో పోల్చలేమని ఆమె ఉత్తరప్రదేశ్ విభజన డిమాండ్లపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications