వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పలగాని కుటుంబానికి పూర్తి భద్రత: సబితా ఇంద్రారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
విజయవాడ: బిసి నేత పలగాని ప్రభాకర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. కూతురు నాగవైష్ణవి హత్య, ఆ తర్వాత పలగాని ప్రభాకర్ మరణంతో తల్లిడిల్లుతున్న ఆయన కుటుంబ సభ్యులను సబితా ఇంద్రారెడ్డి గురువారం పరామర్శించారు. నాగవైష్ణవి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆమె చెప్పారు. హత్యకు గురైన ప్రభాకర్ కారు డ్రైవర్ లక్ష్మణరావు కుటుంబ సభ్యులను కూడా ఆమె పరామర్సించారు.

లక్ష్మణరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని, పిల్లలకు విద్యను అందిస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆమె చెప్పారు. నాగవైష్ణవి హత్య కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రసుత్తం ఉన్న చట్టాల పరిధిలో దోషుల్ని శిక్షిస్తామని ఆమె చెప్పారు. ఈ కేసు పూర్తి వివరాలను నగర పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వివరిస్తారని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X