వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర కోసం విద్యార్థుల పాదయాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Padayatra
గుంటూరు: సమైక్యాంధ్రప్రదేశ్ ను కోరుతూ విద్యార్థులు గురువారం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి హైదరాబాదుకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ శాసనభ్యుడు ధూళిపాల నరేంద్ర చౌదరి ప్రారంభించారు. సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ శామ్యూల్, సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ అప్పిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ పాదయాత్ర ఈ నెల 16వ తేదీన హైదరాబాదు చేరుకుంటుందని విద్యార్థులు చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం సమర్పిస్తామని విద్యార్థులు చెప్పారు.

తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే ప్రభుత్వానిదే బాధ్యత అని జెఎసి కన్వీనర్ శామ్యూల్ అన్నారు. తమను హైదరాబాదులో తెలంగాణ విద్యార్థులు ఆహ్వానిస్తారని, కలిసి ఉండడం వల్ల కలిగే లాభనష్టాలను వారికి వివరిస్తామని వారన్నారు. హైదరాబాదుకు బయలుదేరిన పాదయాత్రను అడ్డుకోవద్దని, ప్రజాస్వామ్యంలో తమకు శాంతియుతంగా ఆందోళన నిర్వహించే హక్కు ఉందని నరేంద్ర చౌదరి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X