వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సాధన కోసం పాముల ఆటలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
మంగపేట: కోమటిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జేఏసీ నాయకులు తెలంగాణ అమరవీరుల రెడీమేడ్‌ స్థూపాన్ని ఏర్పాటు చేసి బుధవారం రెండున్నర గంటలసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్రనాయకుల పాముల ఆటను ఆడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరిస్తూ రెడీమేడ్‌ స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల ఆశయాలను వృథాకానివ్వమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకూ పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జేఏసీ నాయకుడు పాముల పాష రెండు నాగుపాములను తీసుకువచ్చి ఆంధ్ర, తెలంగాణ పాములుగా అభివర్ణించి ఆటలాడించారు. దీంతో ప్రధాన రహదారి వెంట రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, సంజీవ్‌, రాజేందర్‌, పప్పు వెంక ట్‌రెడ్డి, సామ్రాజ్యం, మల్లయ్య, రవీందర్‌, రాజోత్తంరెడ్డి, హైమద్‌, లింగయ్య, శ్రీనివాసచారి, ఉమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X