వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ సాధన కోసం పాముల ఆటలు
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, సంజీవ్, రాజేందర్, పప్పు వెంక ట్రెడ్డి, సామ్రాజ్యం, మల్లయ్య, రవీందర్, రాజోత్తంరెడ్డి, హైమద్, లింగయ్య, శ్రీనివాసచారి, ఉమేష్రెడ్డి పాల్గొన్నారు.
Comments
Story first published: Thursday, February 4, 2010, 9:38 [IST]