వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై జయప్రద మాట్లాడాలి: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
హైదరాబాద్: సమాజ్ వాదీ బహిష్కృత నేత జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణపై తప్పకుండా మాట్లాడాల్సి వస్తుందని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం జెఎసి విద్యార్థుల పాదయాత్రపై తాము మాట్లాడేదేమీ లేదని, ప్రభుత్వం, పోలీసులు చూసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని మాత్రమే తాను సీమాంధ్ర నాయకులను కోరుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఎల్బీ నగర్ నుంచి నల్లగొండ జిల్లా వరకు మానవ హారం చేపట్టారు. ఈ మానవహారాన్ని కోదండరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తున్నారని చూపించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తాము శాంతియుతంగా ఉద్యమిస్తూ సంఘటిత శక్తిని చాటుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోచారం శ్రీనివాస రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బిజెపి నాయకుడు బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిహెచ్ ఇఎల్ తదితర ప్రాంతాల్లో కూడా శుక్రవారం మానవ హారాలు ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X