వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేతను విడిచిన మావోయిస్టులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Congress
విశాఖపట్నం: కొయ్యూరు మండలం బూదిరాళ్ల దగ్గర మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సోమయ్యని మావోయిస్టులు వదిలివేశారు. అతని అనుచరుడు బాలయ్యని మావోయిస్టులు హత్యచేసినట్లు తెలుస్తోంది. సోమయ్యను, బాలయ్యను మావోయిస్టులు శనివారం రాత్రి కిడ్నాప్ చేశారు. కొయ్యూరు మండలం సోలాబు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ మండల శాఖ అధ్యక్షుడు కోనె సోమయ్య, ఎం.మాకవరం గ్రామానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యుడు (టీడీపీ) కాకూరు బాలయ్యలను సాయుధ మావోయిస్టులు తీసుకెళ్లారన్న వార్తలు ఏజెన్సీలో చదువుకున్న ప్రజల్లో భయభ్రాంతులు కలిగించాయి.

పెదవలస ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నట్టు సమాచారం అందడంతో అటువైపుగా పోలీసులు దృష్టి సారించారు. వార్‌ జోన్‌గా పేరుపొందిన కొయ్యూరు మండలం కన్నవరానికి చెందిన సీందరి పెద రంగారావు, కంకిపాటి లకి జైలులో ఉన్నారు. మావోయిస్టులు వీరిని వదిలిపెట్టమని డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అమిత్‌ బాగ్చి, రాష్ట్ర కమిటీ సభ్యుడు రవిశర్మ పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిని విడిచిపెట్టమని మావోయిస్టులు పట్టుబట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిందటి నెలలో మిలీషియా సభ్యురాలు కంకిపాటి లక్ష్మిని పోలీసులు వార్డు సభ్యుడు కాకూరి బాలయ్య ఇంటివద్ద పట్టుకున్నారు. లక్ష్మి అతనికి బంధువు కావడంతో తరచూ అక్కడకు వస్తుంటుంది. దీంతో పోలీసులు అతడిపై బైండోవర్‌ కేసు పెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X